పేరు మార్చుకున్న ఐపీఎల్ జట్టు

by  |
పేరు మార్చుకున్న ఐపీఎల్ జట్టు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వేలం పాటకు కొన్ని గంటల ముందు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఇకపై తమ జట్టు పేరును ‘పంజాబ్ కింగ్స్’గా మారుస్తున్నట్లు ఫ్రాంచైజీ సీఈవో సతీష్ మీనన్ వెల్లడించారు. ఫ్రాంచైజీ పేరుతో పాటు దానికి సంబంధించిన లోగోలో కూడా మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. పంజాబ్ కింగ్స్ బ్రాండ్ పేరు ఇకపై క్రికెట్ అభిమానులకు మరింతగా చేరువ అవుతుందని ఆయన అన్నారు. పంజాబ్ అనే పదం మాత్రం జట్టు నుంచి తొలగించబోమని.. అది మా జట్టుకు చాలా కీలకమైన అంశమని ఆయన చెప్పారు. పంజాబ్ ఫ్రాంచైజీకి మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతీజింటా, కరన్ పాల్‌లు యజమానులుగా ఉన్నారు. 2008 నుంచి ఐపీఎల్‌లో ఉన్న ఈ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. 2014లో రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు గత ఏడాది యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్‌లో 6వ స్థానంతో సరిపపెట్టుకున్నది. కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఈ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.



Next Story

Most Viewed