వరల్డ్ చాంపియన్‌షిప్స్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్

by  |
వరల్డ్ చాంపియన్‌షిప్స్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్
X

దిశ, స్పోర్ట్స్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్లు దూసుకొని పోతున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో చోచువాంగ్‌పై 21-14, 21-18 తేడాతో గెలుపొందింది. ఇటీవల ముగిసిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో చోచువాంగ్ చేతిలో ఓడిన దానికి సింధు ప్రతీకారం తీర్చుకున్నది. ఇక క్వార్టర్ ఫైనల్‌లో తై జూతో సింధు తలపడనున్నది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-10, 21-15 తేడాతోలు గాంగ్‌జూ గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. అయితే భారత మహిళల జోడీ అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి 13-21, 15-21 తేడాతో కితితరకుల్-ప్రజోంగ్‌జై చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి జోడి 20-21, 21-18, 15-21 తేడాతో ఓంగ్ యూ షిన్- త్యోఈయే చేతిలో ఓడిపోయి తిరుగుముఖం పట్టారు.


Next Story

Most Viewed