అమ్మలా లేనని హేళన చేస్తున్నారు…

by  |
అమ్మలా లేనని హేళన చేస్తున్నారు…
X

అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఇద్దరు పిల్లలు. జాన్వి ఇప్పటికే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వగా.. చిన్న పాప ఖుషి సినీరంగ ప్రవేశానికి ఇంకా టైమ్ ఉంది. ఇంకా కెరీర్ మొదలే పెట్టని తనపై వస్తున్న కామెంట్స్ వింటుంటే చాలా బాధగా ఉందని చెబుతోంది ఖుషి.

https://www.instagram.com/tv/B_9RTTQgfZW/?utm_source=ig_web_copy_link

ప్రస్తుతం లాక్‌డౌన్‌ పీరియడ్‌ను తండ్రి, సోదరితో కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఖుషి.. క్వారంటైన్ టేప్స్ పేరుతో షేర్ చేసిన వీడియోలో చాలా ఎమోషనల్ అయింది. ‘నేనేమీ సాధించకపోయినా కొందరు తనను అమితంగా ప్రేమిస్తారని.. చాలా ఇష్టపడతారని తెలిపిన ఈ క్యూట్ గర్ల్.. వారి కోసమైనా ఏదో ఒకటి సాధించాలనిపిస్తోంది’ అని చెప్తోంది. ఇక 19 ఏళ్లు కూడా నిండని తనపై వచ్చే కామెంట్స్ దారుణంగా ఉంటాయని.. అవి కాస్తా నాకు మానసిక ఒత్తిడిని కలిగించాయని తెలిపింది. ‘నేను ఇంకా ఎదుగుతున్న అమ్మాయిని.. అయినా కూడా మా అమ్మలాగా, అక్క లాగా అందంగా లేనని హేళన చేస్తున్నారని బాధ పడింది. దీంతో తన ఆహారం, డ్రెస్సింగ్‌లో మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని’ చెప్పింది. అయితే ఈ విషయాలపై చివరకు తనకు తానే రియలైజైందట. అందుకే ‘ఎవరి గురించో నువ్వెందుకు నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి.. నీకు నచ్చినట్లు నువ్వు ఉండు.. నీకు నచ్చిన పని నువ్వు చెయ్యి’ అని చెప్తోంది.

ఈ వీడియో చూసిన శ్రీదేవి అభిమానులు.. చిన్న పిల్లను పట్టుకుని కామెంట్స్ చేసిన వారికి సరైన బుద్ధి చెప్పింది అంటున్నారు. ఖుషి మాటలతోనైనా అలాంటి మనుషులు మారితే బాగుంటుంది అంటున్నారు.

Next Story

Most Viewed