ఖమ్మంలో కొత్తగా 24 పాజిటివ్ కేసులు

by  |
ఖమ్మంలో కొత్తగా 24 పాజిటివ్ కేసులు
X

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కరోనా మహమ్మారి భారీగా పెరుగుతుంది. జిల్లాలో మొదటి కేసు పాలేరు నియోజకవర్గంలోనే నమోదు కావడం, తర్వాత కొన్ని రోజులు స్తబ్దతగా ఉన్న మహమ్మారి వైరస్ నేలకొండపల్లి మండల కేంద్రంలో ఒక్కసారిగా 12 కేసులతో జిల్లాను వణికించింది. ఆ తరువాత జాడ లేదనుకుంటున్న సందర్భంలో మళ్ళీ ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులెటెన్‌లో తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామంలో 40ఏండ్ల మహిళకు మహమ్మారి వైరస్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. అదే విధంగా రూరల్ మండలం ఖానపురంలో, పెద్దతండా గ్రామాల్లో ఒకొక్కటి చొప్పున వచ్చాయి. మొత్తం మీద ఈ రోజు నియోజకవర్గంలో మూడు కరోనా కేసులు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో ఈరోజు 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. దీంతో మొత్తం 248 కేసులు నమోదు అయ్యాయి.

Next Story