- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, చార్మినార్: తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుల లడ్డూలను నిమజ్జనోత్సవాలలో భాగంగా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం వేలం పాట నిర్వహించారు. పాతబస్తీలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన వేలం పాటల్లో లడ్డూలు వేలల్లో, లక్షల్లో ధర పలికింది. అలియాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటలో పాతబస్తీ అలియాబాద్కు చెందిన లక్ష్మారెడ్డి రూ.1.35 లక్షలకు సొంతం చేసుకున్నారు.
అలాగే మేకల్బండలో దేవ్యూత్అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటలో పోసాని సుధాకర్ రూ.1.10లక్షలకు కైవసం చేసుకున్నారు. కందికల్గేట్ వీరహనుమాన్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో ఛత్రినాక ఇన్స్పెక్టర్సయ్యద్అబ్దుల్ఖాదర్జిలాని రూ.5,100లకు సొంతం చేసుకోవడం విశేషం. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో శ్రీరామ భక్త సమాజం ఆధ్వర్యంలో జరిగిన వేలం పాటలో రూ. 1.76లక్షలకు లడ్డూను కమిటీ సొంతం చేసుకుంది.