కేజీఎఫ్ మేకర్స్ విత్ ప్రభాస్?

by  |
కేజీఎఫ్ మేకర్స్ విత్ ప్రభాస్?
X

దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ మేకర్స్ మరో మాసివ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నారు? డిసెంబర్ 2న మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ డీటేయిల్స్ రివీల్ చేయనున్నారు?. ఇది హొంబలి ఫిల్మ్స్ బ్యానర్‌లో వస్తున్న ఏడో సినిమా కాగా.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ‘డియర్ ఆడియన్స్.. మా సినిమాను మా కన్నా ఎక్కువ మీరే ప్రేమిస్తున్నారు. ఇదే ప్రేమను కొనసాగించేందుకు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో వస్తున్నాం. మీ హార్ట్స్ ఓపెన్ చేసుకుని అనౌన్స్‌మెంట్ కోసం సిద్ధంగా ఉండండి’ అని కోరారు.

కాగా ప్రభాస్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అంటున్న అభిమానులు.. ప్రభాస్‌ను జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మరీ ఒకేసారి ఇన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు చేయకుండా కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న మూడు సినిమాల బడ్జెట్ ఇప్పటికే రూ. 1000కోట్లకు చేరగా కేర్‌ఫుల్‌గా ఉండమని సజెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.


Next Story

Most Viewed