కేజీఎఫ్ 2 షూటింగ్‌పై క్లారిటీ

by  |
కేజీఎఫ్ 2 షూటింగ్‌పై క్లారిటీ
X

డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 సూపర్ సక్సెస్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం..రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోగా..ప్రశాంత్ నీల్ కేపబిలిటీ, టేకింగ్‌కు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఫిదా అయింది.

ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 రాబోతుండగా..భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీ‌గా వస్తున్న మూవీ కోసం అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సినిమా దాదాపు పూర్తయ్యే క్రమంలో కరోనా అడ్డు పడింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ పడగా..దాదాపు ఆరు నెలల తర్వాత సర్కారు అనుమతులతో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది మూవీ యూనిట్.

హోమెబుల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం కాబోతుందని ట్వీట్ చేశారు సహ నిర్మాత కార్తీక్ గౌడ. గురువారం నుంచి షూటింగ్ జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయగా..దీనిపై క్లారిటీ ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు కార్తీక్. ‘అధీరా’గా విలన్ పాత్రలో నటిస్తున్న సంజయ్‌దత్ ఈ షెడ్యూల్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ, లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన..సినిమా షూటింగ్‌లకు కొన్నాళ్లు దూరంగా ఉంటానని ప్రకటించారు. సినిమా పూర్తి కావాలంటే సంజూ భాయ్ చిత్రీకరణకు హాజరు‌కావాల్సి ఉండగా..మూవీ యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే చర్చ జరుగుతుంది.


Next Story