భారత్‌కు చేరిన సౌమ్య సంతోష్ మృతదేహం

by  |
భారత్‌కు చేరిన సౌమ్య సంతోష్ మృతదేహం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య జరిగిన పరస్పర దాడుల్లో భారత మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న కేరళకు చెందిన సౌమ్య సంతోష్ రాకెట్ దాడిలో మరణించింది. ఇజ్రాయిల్‌లోని అష్కెలోన్ నగరంలో హెల్పర్‌గా పని చేస్తున్న సౌమ్య అదే నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. దాడులు జరుగుతున్న సమయంలో ఇంట్లోనే ఉన్న సౌమ్య భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగానే రాకెట్ పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం ఇజ్రాయిల్ నుంచి ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి వీ. మురళీధరన్, ఇజ్రాయిల్ రాయబారి యెడిడియా క్లెయిన్ సౌమ్య పార్థీవదేహానికి నివాళుల అర్పించారు. అనంతరం మృతదేహాన్ని కేరళకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Next Story

Most Viewed