- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు నెమ్మదిగా తగ్గముఖం పడుతున్న సమయంలో తాజాగా బర్డ్ ఫ్లూ వ్యాధి వేగంగా ప్రబలుతోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాగా, ఇటీవలే కేరళలో ఈ వ్యాధి కోరలు చాస్తోంది. దీని బారిన పడి ఇప్పటికే 12,000 బాతులు మృత్యువాత పడగా, మరో 36,000 బాతులను వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తుగా అధికారులు చంపేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బర్డ్ ఫ్లూ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో దీనిని ప్రత్యేక విపత్తుగా ప్రకటిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం తెలిపింది. వైరస్ లక్షణాలు ఉన్న పక్షులను జనసంచారం లేని ప్రాంతాల్లో ఖననం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
- Tags
- V
Next Story