సాధారణ వ్యక్తిలా ఆటోలో హోటల్‌కు వెళ్లి.. సొంత డబ్బులతో భోజనం సీఎం

by  |
cm-Bhojanam-1
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం అంటే చాలు.. ఆ హంగు, ఆర్భాటాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కాన్వాయే చాలా పెద్దగా ఉంటది. ఆయన వెంట నిత్యం వందల సంఖ్యలో ఉంటారు. అంతేకాదు ఆయన చుట్టూ పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉంటది. ఇలా ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి వాటన్నిటినీ పక్కకు పెట్టి ఓ సాధారణ వ్యక్తిలా ఆటోలో వెళ్లి తన సొంత డబ్బులతో హోటల్ లో భోజనం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ సీఎంను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చాలా సందర్భాల్లో ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. తాజాగా ఆయన ఓ సాధారణ వ్యక్తిలా ఆటోలో హోటల్ కు వెళ్లి తన సొంత డబ్బులతో భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రిని ఇతర ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Next Story

Most Viewed