- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: సీఎం అంటే చాలు.. ఆ హంగు, ఆర్భాటాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కాన్వాయే చాలా పెద్దగా ఉంటది. ఆయన వెంట నిత్యం వందల సంఖ్యలో ఉంటారు. అంతేకాదు ఆయన చుట్టూ పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉంటది. ఇలా ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి వాటన్నిటినీ పక్కకు పెట్టి ఓ సాధారణ వ్యక్తిలా ఆటోలో వెళ్లి తన సొంత డబ్బులతో హోటల్ లో భోజనం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ సీఎంను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చాలా సందర్భాల్లో ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. తాజాగా ఆయన ఓ సాధారణ వ్యక్తిలా ఆటోలో హోటల్ కు వెళ్లి తన సొంత డబ్బులతో భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రిని ఇతర ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.