కీర్తితో రైడ్‌కు సై అంటున్న ‘నైకీ’

by  |
కీర్తితో రైడ్‌కు సై అంటున్న ‘నైకీ’
X

‘మహానటి’ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి ‘కీర్తి సురేష్’. ఇటీవలే ‘పెంగ్విన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకోగా.. కీర్తి నటనకు మరోసారి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ‘సర్కారు వారి పాట’లో మహేశ్ బాబు సరసన నటించే లక్కీ చాన్స్ కొట్టేసింది. ఇందులో కీర్తి బ్యాంకు ఉద్యోగిని పాత్రలో నటించబోతున్నారని సమాచారం. కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ఇంకా షూటింగ్‌ మొదలు కాలేదు. ఈ గ్యాప్‌లో ఇంట్లోనే ఉంటున్న కీర్తి.. తన పెట్ డాగ్ ‘నైకీ’తో ఫొటోలకు ఫోజులిచ్చింది. తన విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ మహానటి.. తాజాగా నైకితో దిగిన ఫోటోలను పంచుకోవడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ ఫొటోల్లో.. నైకీ కీర్తి వైపు ఓ లుక్ ఇచ్చింది. దానికి ‘అమ్మా షూటింగ్ ఇంక చాలు.. సరదాగా అలా ఓ రైడ్‌కు వెళ్లొద్దాం పదా’ అని నైకీ అన్నట్లుగా కీర్తి కామెంట్ పెట్టింది. ‘ప్రతిసారి అద్భుతమైన మూమెంట్స్‌నే క్యాప్చర్ చేస్తుంటారు.. మీకు ధన్యావాదాలు’ అంటూ ఫొటోగ్రాఫర్ వెంకట్‌కు కూడా థ్యాంక్స్ చెప్పింది కీర్తి. నైకీతో సరదాగా దిగిన ఈ ఫొటోలకు ‘నైకీ డైరీస్, బౌబౌ’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు జత చేసింది. లాక్‌డౌన్‌కు ముందే కీర్తి నటించిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి ‘మిస్ ఇండియా’. ఈ చిత్ర నిర్మాత కూడా డిజిటల్ రిలీజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె నటించిన మరో సినిమా ‘గుడ్ లక్ సఖి’ నిర్మాత కూడా ఓటీటీ రిలీజ్‌కు బేరాలు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం.

ఇక యువ కథానాయకుడు నితిన్, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో తొలిసారిగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా కూడా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed