మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కీర్తిసురేశ్

by  |
మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కీర్తిసురేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేశ్ తెలుగు, తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌లో దుబాయిలో బిజీగా ఉన్న భామ..మరో మలయాళం ప్రాజెక్ట్ ప్రకటించింది. మెగాస్టార్ మోహన్ లాల్ ‘మరక్కర్ అరేబియన్ సీ లయన్‌’ సినిమా ద్వారా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి..రెండో సినిమా అనౌన్స్ చేసింది.

‘వాశి’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో టొవినో థామస్ హీరో. రేవతి కళామందిర్ బ్యానర్‌పై కీర్తి తండ్రి జి.సురేష్ కుమార్ సినిమాను నిర్మిస్తున్నారు. విష్ణు జి.రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా టైటిల్‌లో మర్డర్ కేసుకు సంబంధించిన డీటేల్స్ ఉండగా.. బ్యాక్ గ్రౌండ్‌లో కీర్తి, టొవినో థామస్ పిక్చర్స్‌ పెయింట్‌తో ఫిల్ చేసి ఉన్న టైటిల్‌ పోస్టర్ రిలీజ్ చేశారు మోహన్ లాల్. ఈ చిత్రం తన మనసుకు చాలా దగ్గరైందని.. ఏడేళ్లుగా దీనిపై వర్క్‌ చేస్తున్నామని తెలిపింది ‘మహానటి’ కీర్తి సురేశ్. కైలాశ్ మీనన్ సంగీతం సమకూరుస్తున్న సినిమాకు వినాయక్ శశికుమార్ లిరిక్స్ అందిస్తున్నారు.


Next Story