- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నల్లగొండ: మాంసం దుకాణాల వద్ద సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ముఖ్యంగా ఆదివారం మాంసం దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బయటకు వచ్చిన ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని ఆమె సూచించారు. అదే విధంగా మటన్, చికెన్ దుకాణాదారులు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని, లేనియేడల కఠిన చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టర్ హెచ్చరించారు.
tags: collector anita ramachandran, meat shops, keep maintain social distance
Next Story