జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వారిని దూరం పెట్టండి: ఈసీ

by  |
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వారిని దూరం పెట్టండి: ఈసీ
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. క్రిమినల్ కేసులు ఉన్న నాయకులను ఈ ఎన్నికల్లో దూరం పెట్టేలా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలను కోరినట్టు సమాచారం. ప్రస్తుతం 46 మంది సిట్టింగ్ కార్పొరేటర్ల పై క్రిమినల్ కేసులున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన 72 మంది పై క్రిమినల్ కేసులున్నాయి. అయితే, ఈసీ నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తీరా ఎన్నికలు దగ్గర పడిన వేళ ఈ నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు ఎలా స్వీకరిస్తాయో అన్న అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story

Most Viewed