నాయినికి సీఎం కేసీఆర్ పరామర్శ

by  |
నాయినికి సీఎం కేసీఆర్ పరామర్శ
X

దిశ, వెబ్‌డెస్క్: తీవ్ర అనారోగ్యంతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ నాయిని నర్సింహారెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్ నాయినిని పరామర్శించి, ఆయన ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన నాయిని నర్సింహారెడ్డి ఇటీవలే కోలుకొని మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇదేక్రమంలో మళ్లీ అపోలో ఆస్పత్రిలో చేరిన నాయిని చికిత్స తీసుకుంటున్నారు. అయితే నాయిని ఆరోగ్యం చికిత్సకు సహకరించడం లేదని సమాచారం.

Next Story

Most Viewed