కేసీఆర్ షాకింగ్ కామెంట్స్.. వారికి కరోనా సోకాలి

by  |
కేసీఆర్ షాకింగ్ కామెంట్స్.. వారికి కరోనా సోకాలి
X

కరోనా వైరస్‌పై బాధ్యత లేకుండా సోషల్ మీడియా దుష్ప్రచారంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం పని లేక, కావాలని పని గట్టుకొని తప్పుడు వార్తలను వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారని, వారి పని పడతామని హెచ్చరించారు. మొన్నటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవగాహన లేకుండా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే వారు కొందరు వ్యక్తులు దొరుకుతున్నారని, వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. మీడియాల్లో గానీ దుర్మార్గమైన ప్రచారాలు చేసే వాళ్లకు భయంకరమైన శిక్షలు విధిస్తామని చెప్పారు. ఆ శిక్షలు ఎలా ఉంటాయో తాను చూపిస్తానని, తాము గొప్పవాళ్లం, ఎవరూ పట్టుకోలేరన్న అనుకుంటున్న మూర్ఖులకు ఇదే తానిచ్చే హెచ్చరిక అని స్పష్టం
చేశారు. ఎంత దుష్ప్రచారం చేస్తారో, అంతకు వంద రెట్లు శిక్ష అనుభవిస్తారని, ఆ చెడు బుద్ధి మానుకోవాలని అన్నారు. ‘దేశం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో ఎందుకీ దిక్కుమాలిన, చిల్లర ప్రచారాలు చేయాలి. అలా చేసేవాళ్లకు అందరి కంటే ముందు కరోనా సోకుతుంది అని అన్నారు.

Tags : CM KCR, shocking comments, corona, Social media, Propaganda

Next Story

Most Viewed