ఉద్యోగ సంఘాలతో సీఎం సుదీర్ఘ సమావేశం…

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సీఎం కేసీఆర్​ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్​ మామిళ్ల రాజేందర్​, సెక్రెటరీ మమత, కార్యదర్శులు ఏనుగుల రాజేందర్​, రాయకంటి ప్రతాప్​తో పాటు మంత్రి శ్రీనివాస్​గౌడ్​, జేఏసీ మాజీ ఛైర్మన్​ కారం రవీందర్​రెడ్డి తదితరులు సీఎంతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిట్​మెంట్​పై చర్చించిన సీఎం కేసీఆర్​… దాదాపు 30 శాతం వరకు ఫిట్​మెంట్​ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుతున్నారు.

ప్రస్తుతం మండలి ఎన్నికల్లో ఉద్యోగ వర్గాల నుంచి పీఆర్సీపైనే వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రులు… ఉద్యోగ వర్గాల మద్దతు కూడబెట్టుతున్నా పీఆర్సీపై క్షేత్రస్థాయిలో వ్యతిరేక వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రులు కూడా సీఎం కేసీఆర్​కు నివేదించినట్లు తెలుస్తోంది. దీంతో అత్యవసరంగా సీఎం కేసీఆర్​ ఉద్యోగులతో చర్చించేందుకు నిర్ణయం తీసుకుని మధ్యాహ్నం ఉద్యోగ నేతలను ఆహ్వానించారు. సుమారు మూడు గంటల పాటు చర్చించారు. అనంతరం పీఆర్సీపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఉద్యోగ సంఘాలకు సీఎం కేసీఆర్ హామీ ఇదే… ఫిట్​మెంట్ ఎంత పెంచనున్నారంటే..?



Next Story

Most Viewed