నిజాం తరహాలో కేసీఆర్ పాలన చేస్తున్నారు: తరుణ్ చుగ్

by  |
నిజాం తరహాలో కేసీఆర్ పాలన చేస్తున్నారు: తరుణ్ చుగ్
X

దిశ, వెబ్‌డెస్క్: నిజాం తరహాలో సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ…పార్టీకి సంబంధించి తాను 10 సమావేశాల్లో పాల్గొంటానని చెప్పారు.

ఎక్కడికి వెళ్లినా రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని అన్నారు. సీఎం కేసీఆర్‌ను రాజాబాబు అంటూ తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఫాం హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రాలేదని పేర్కొన్నారు. . పేదలకు ఇండ్లు, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.

Next Story

Most Viewed