అమితాబ్ వల్లే రూ. కోటి గెలిచా : కేబీసీ విన్నర్

by  |
అమితాబ్ వల్లే రూ. కోటి గెలిచా : కేబీసీ విన్నర్
X

దిశ, సినిమా: అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి సీజన్ 13’లో మధ్యప్రదేశ్‌కు చెందిన గీతా సింగ్ రూ. కోటి గెలుచుకుంది. ఈ ఏడాది క్రోర్‌పతిగా నిలిచినవారిలో ఈమె మూడో వ్యక్తి కావడం విశేషం. కాగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన కేబీసీ జర్నీ గురించి పంచుకున్న గీత.. ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు 17 ఏళ్లుగా ట్రై చేస్తున్నట్లు చెప్పింది. కేబీసీ షో ప్రారంభమైనప్పుడే ఏదో ఒక రోజు ఈ ప్లాట్‌ఫామ్‌కు చేరుకుంటానని డిసైడ్ అయినట్లు తెలిపింది.

ఒకవేళ ‘షో’కు రీచ్ కాగలితే.. ప్రపంచవ్యాప్తంగా తన ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటానని తనకు తానే చెప్పుకున్నట్లు పేర్కొంది. ఇక హాట్ సీట్‌లో బిగ్ బీ ఎదురుగా కూర్చున్నాక నిజంగా ఆశ్చర్యపోయానన్న గీత.. బచ్చన్ జీ నిజంగా ఫ్యామిలీ మెంబర్‌ మాదిరి కలిసిపోయి కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేశారని చెప్పింది.ఇండియాలోనే అతిపెద్ద సూపర్‌స్టార్ అయినప్పటికీ.. సాధారణ వ్యక్తి మాదిరే ఉంటారని తెలిపింది. కంటెస్టెంట్లను నాలెడ్జబుల్ పర్సన్‌గా భావించేలా చేసి, వారిలోని భయాలు పోగొడతారని, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే సులభంగా గేమ్ ఆడగలిగానని వివరించింది.



Next Story