కత్రిన బ్యాక్ టు షూట్

by  |
కత్రిన బ్యాక్ టు షూట్
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్‌ టైమ్‌లో బ్రిటన్‌లోని తన తల్లి దగ్గరకు వెళ్లాలనుకున్న బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్‌కు చుక్కెదురైంది. దీంతో కాట్స్ ఇండియాలోనే ఉండిపోయింది. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్ ఆంక్షలు సడలించారు. షూటింగ్స్ కూడా మళ్లీ మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే బ్రిటన్ వెళ్లి, తన తల్లిదండ్రులతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసిన కత్రిన.. ‘ఫోన్ భూత్’ షూటింగ్ కోసం మళ్లీ తిరుగు ప్రయాణమైంది.

కత్రిన చివరగా ‘భారత్’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ‘ఆంగ్రేజీ మీడియం’ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన కాట్స్.. 2020లో రెండు సినిమాలకు సైన్ చేసింది. అందులో ఒకటి అక్షయ్ కుమార్‌తో ‘సూర్యవంశీ’ కాగా అది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చిలోనే విడుదల కావాల్సి ఉండగా.. పాండమిక్ కారణంగా వాయిదా పడింది. ఇక కత్రిన చేస్తున్న మరో చిత్రం ‘ఫోన్ బూత్’. పాండమిక్ తర్వాత తిరిగి ఫోన్ బూత్ షూటింగ్ ప్రారంభ కానుంది. ఇందుకోసం బ్రిటన్ నుంచి తిరుగు ప్రయాణమైన కత్రిన.. ఈ ప్రయాణంలో హెయిర్ స్టైలిస్ట్ డేనియల్ బాయర్‌ను కలిసింది. ఇక ఫోన్ బూత్‌లో ఇషాన్ ఖత్తర్, సిద్ధాంత్ చతుర్వేది లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. గోవాలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిసింది.



Next Story

Most Viewed