TRS సోషల్ మీడియా మండలాధ్యక్షుడిగా కాట్రగడ్డ..

by  |
TRS సోషల్ మీడియా మండలాధ్యక్షుడిగా కాట్రగడ్డ..
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండల టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడిగా కాట్రగడ్డ సురేందర్ పటేల్ నియామకం అయ్యారు. ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆయన నియామకాన్ని ధృవీకరించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాట్రగడ్డ సురేందర్ పటేల్‌కు నియామకపత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సురేందర్ పటేల్ మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి సోషల్ మీడియా ప్రెసిడెంట్‌గా నియమించిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతీ నిత్యం రేగా కాంతారావు అడుగుజాడల్లోనే నడుచుకుంటానని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విస్తరింపజేస్తానని పేర్కొన్నారు. మండలంలో టీఆర్ఎస్ పార్టీని అగ్రవర్ణంగా తీర్చిదిద్ది శక్తి వంతంగా తయారు చేసేలా కృషిచేస్తానన్నారు.

Next Story

Most Viewed