ఆ స్కూల్ లో ఇద్దరే టీచర్లు.. తనిఖీ చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి..

by  |
mla-rohith-reddy
X

దిశ, బషీరాబాద్: మండలంలోని కాశింపూర్ ప్రాథమిక పాఠశాలను తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనిఖీ చేశారు. పాఠశాలలో 175 మంది విద్యార్థులకు గాను ఇద్దరు ఉపాధ్యాయులే ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాధికారికి ఫోన్ చేసి పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. దీపావళి పండుగ తర్వాత మరో ఇద్దరిని నియమిస్తామని ఎమ్మెల్యేకు జిల్లా విద్యాధికారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ అధిక నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో తాండూరు నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రకటించారు.



Next Story

Most Viewed