శ్రీ‌వారికి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వం

by  |
శ్రీ‌వారికి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వం
X

దిశ,విశాఖపట్నం: తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లోని ఎంజిఎం గ్రౌండ్స్‌లో శ్రీ‌వారి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డితో పాటు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, విశాఖ శ్రీశారదాపీఠం స్వామీజి స్వరూపానందేంద్ర, ఉత్తరాధికారి స్వామీ స్మాత్మానందేంద్ర హాజరై కార్తీక దీపాత్సోవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్-19 నేప‌థ్యంలో భౌతిక‌దూరం పాటిస్తూ 800 మంది మ‌హిళ‌లు దీపాలు వెలిగించేలా ఏర్పాటుచేశారు. వేదిక‌ను శోభాయ‌మానంగా పుష్పాల‌తో, విద్యుత్ దీపాల‌తో అలంక‌రించారు.



Next Story