సమీపిస్తున్న కార్తీకమాసం.. ఏర్పాట్లు శూన్యం

by  |
సమీపిస్తున్న కార్తీకమాసం.. ఏర్పాట్లు శూన్యం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి కారణంగా, ప్రతి ఏడాది ముందుగానే చేసే కార్తీకమాస ఏర్పాట్లను ఈసారి ప్రభుత్వం ఇంకా మొదలు పెట్టలేదు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి రేవులో ప్రతి సంవత్సరం కార్తీకమాస వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. దీంతో ప్రభుత్వం పండుగ ఏర్పాట్లను వైభవంగా నిర్వహిస్తుంది. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను ఏర్పాటు చేసేది కానీ ఈ ఏడాది స్థానిక దేవాదాయ, మున్సిపాలిటీ అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. కాగా ఈ నెల 16 నుంచి కార్తీకమాసం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed