రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కర్నాటి రమేష్

by  |
Karnati Ramesh
X

దిశ, మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పట్టణానికి చెందిన రైస్ మిల్లర్ కర్నాటి రమేష్ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేంద్ర జారి చేసిన నియామక పత్రాన్ని ఎమ్మెల్యే భాస్కర్ రావు చేతుల మీదుగా అందుకున్నారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 8 ఏళ్ల పాటు పని చేసిన రమేష్.. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులకు, మిల్లర్లకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించాలని ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆకాంక్షించారు.


Next Story