అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైసీపీ!

by  |
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైసీపీ!
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ హయాంలో ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందన్న జగన్ … ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రతి ఒక్కరికి సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఏపీకి భారీగా ఇళ్లను మంజూరు చేశారని కన్నా పేర్కొన్నారు.

నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను పేదలకు పంచకుండా స్థలాల పేరుతో కాలయాపన చేస్తున్నారని కన్నా విమర్శించారు. అప్పుడు ఇళ్ల నిర్మాణంలో టీడీపీ అవినీతికి పాల్పడితే.. ఇప్పుడు ఇళ్ల స్థలాల్లో వైసీపీ అవినీతికి పాల్పడుతోందని చెప్పారు. ఎన్నికల కమిషనర్ విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.


Next Story

Most Viewed