పాప్ సింగర్‌‌పై కంగన తిట్ల పురాణం.. కారణం రైతులు

by  |
పాప్ సింగర్‌‌పై కంగన తిట్ల పురాణం.. కారణం రైతులు
X

దిశ, సినిమా : ఇండియాలో రైతుల నిరసనకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తాజాగా ఇంటర్నేషనల్ పాప్ సింగర్, గ్రామీ అవార్డ్ విన్నర్, ట్విట్టర్‌లో 100 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ కలిగిన రిహన్న ట్వీట్‌తో ఫార్మర్స్ ప్రొటెస్ట్‌కు వరల్డ్ వైడ్‌గా సెలబ్రిటీలు, సోషల్ యాక్టివిస్ట్‌లు, పొలిటిషియన్స్ నుంచి సపోర్ట్ పెరుగుతోంది. ‘మనమెందుకు రైతుల నిరసన గురించి మాట్లాడకూడదు’ అంటూ మంగళవారం తను చేసిన ట్వీట్.. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ కావడంతో ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సైతం ఈ ఇష్యూ గురించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. కానీ బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి మాత్రం ఇప్పటి వరకు ఒక్క సపోర్టింగ్ ట్వీట్ కూడా రాకపోవడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. హాలీవుడ్ కూడా రైతులకు మద్దతిస్తుంటే బాలీవుడ్ ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నిస్తున్నారు. దీంతో ట్విట్టర్‌లో #Bollywood ట్రెండ్ అయిపోయింది.

ఇదిలా ఉంటే, పాప్ సింగర్ రిహన్న ట్వీట్ తర్వాత దేశవ్యాప్తంగా రైతుల నిరసనకు మద్దతివ్వాలని సామాన్యులు కూడా ట్వీట్ చేస్తున్నారు. మన ఫార్మర్స్‌ను కాపాడుకుందామని పిలుపునిస్తున్నారు. కానీ ఎప్పటిలాగే బాలీవుడ్ భామ కంగనా రనౌత్ మాత్రం ఫార్మర్స్‌కు సపోర్ట్ ఇచ్చిన పాప్ సింగర్ రిహన్నను ‘ఫూల్, డమ్మీ’ అంటూ తిట్టిపోయడం గమనార్హం. అక్కడితో ఆగకుండా ‘రైతుల నిరసన గురించి ఎవరు కూడా ఎందుకు మాట్లాడటం లేదంటే.. వారు రైతులు కాదు కాబట్టి’ అని చెప్పింది. వారు భారతదేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులని, తద్వారా ముక్కలైన భారత్‌ను స్వాధీనం చేసుకుని యూఎస్ఏ మాదిరి చైనా కాలనీగా మార్చాలని చైనా చూస్తోందని మండిపడింది. ఈ మేరకు ‘ఫూల్ నీ పని నువ్వు చూసుకో, మా దేశాన్ని అమ్ముకునేందుకు మీలాగా మేమేమీ డమ్మీస్ కాదంటూ ట్విట్టర్ ద్వారా రిహన్నకు వార్నింగ్ ఇచ్చింది.

Next Story

Most Viewed