‘కామారెడ్డి టీఆర్ఎస్’ రూ.5 లక్షల విరాళం

by  |
‘కామారెడ్డి టీఆర్ఎస్’ రూ.5 లక్షల విరాళం
X

దిశ, నిజామాబాద్: కరోనాపై పోరులో భాగంగా కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ రూ.5 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమీకరించిన రూ.5లక్షల నగదును మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శరత్‌కు అందజేశారు. ఈ నగదును జిల్లాలో కరోనా నివారణకు కృషి చేస్తున్న అత్యవసర ప్రభుత్వ విభాగాల సిబ్బంది కోసం వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను మంత్రి వేముల అభినందించారు.

Tags: kamareddy TRS, donation, vemula prashanth reddy, collector sharath, trs activists, corona, virus,


Next Story

Most Viewed