నిల్వ నీటిని తొలగించిన కామారెడ్డి కలెక్టర్ దంపతులు

by  |
నిల్వ నీటిని తొలగించిన కామారెడ్డి కలెక్టర్ దంపతులు
X

దిశ, నిజామాబాద్: సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమం ‘‘డ్రై డే’’‌ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్‌కుమార్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు అదివారం కలెక్టర్ దంపతులు తమ నివాసంలో పూల కుండీలలో నిల్వ నీటిని తొలిగించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్‌రావు తన నివాసంలో నిల్వ నీటిని తొలగించారు.

Next Story

Most Viewed