రజనీ సపోర్ట్ ఇస్తే టార్చ్ లైట్ వెలుగుతుందా కమల్

by  |
రజనీ సపోర్ట్ ఇస్తే టార్చ్ లైట్ వెలుగుతుందా కమల్
X

దిశ,వెబ్‌డెస్క్: తమిళ్ సూపర్ స్టార్ మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్..,తలైవా రజనీ కాంత్ తో భేటీ అయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రజనీ మద్దతుకోసం కమల్ హాసన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కమల్ శనివారం రజనీతో 30నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు.
మరోవైపు ఆదివారం మక్కల్ నీది మయ్యమ్ పార్టీ స్థాపించి మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఆ పార్టీ పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఇకపై తాను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు కమల్ చెప్పారు. అయితే 2020 డిసెంబర్ నెలలో పార్టీ ఏర్పాటుకై వెనక్కి తగ్గిన తలైవా తో కమల్ హాసన్ భేటీ అవ్వడం చర్చాంశనీయంగా మారింది.
కాగా గత నెలలో,2019 లోక్ సభ ఎన్నికలలో టార్చ్ లైట్ సింబల్ పై పోటీ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ టార్చ్ లైట్ గుర్తుపై పోటీ చేస్తున్నట్లు, ఇప్పటికే టార్చ్ లైట్ సింబల్ గుర్తును తమకు కేటాయించినట్లు మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ తెలిపారు.

Next Story

Most Viewed