సీఎం జగన్‌ను ప్రశ్నించిన టీడీపీ నేత

by  |
సీఎం జగన్‌ను ప్రశ్నించిన టీడీపీ నేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి టీడీపీ నేత కళా వెంకట్రావు లేఖ రాశారు. ఈ లేఖలో సీఎంకు ఆయన 18 ప్రశ్నలు సంధించారు. కాపులకు సంక్షేమం పేరుతో ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కాపులను రాజకీయంగా, ఆర్థికంగా ఉపయోగించుకుని.. అవసరం తీరాకా వదిలేశారని విమర్శించారు. కాపులకు గోరంత చేసి కొండంత ప్రచారం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్లపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని జగన్‌ను కళా వెంకట్రావు లేఖలో ప్రశ్నించారు. వీటన్నింటీపై సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed