- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భారీ స్కాంకు తెరతీశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజేనేయులు ఆరోపించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ కోసం భూ సేకరణకు నడుం బిగించిన సంగతి తెలిసిందే అన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న బ్రహ్మనాయుడు 100 ఎకరాలు ప్రభుత్వానికి విక్రయించారని ఆరోపించారు. ఎకరం 4 లక్షల రూపాయల విలువ చేసే భూమిని 18 లక్షల రూపాయలుకు విక్రయించారని అన్నారు. నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వానికి 18 కోట్ల రూపాయలకు విక్రయించారని, తద్వారా ఆయన 14 కోట్ల రూపాయలు స్కాంకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే దోపిడీకి ప్రభుత్వాధికారులు కూడా సహకరించారని ఆయన విమర్శించారు. ఈ స్కాంపై ప్రభుత్వం విచారణ జరపాలని, ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags: guntur, tdp, gv anjaneyulu, vinukonda, government houses scheme, 14 crore schame