రేపు యాదాద్రిలో పర్యటించనున్న జస్టిస్ ఎన్వీ రమణ

by  |
రేపు యాదాద్రిలో పర్యటించనున్న జస్టిస్ ఎన్వీ రమణ
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో పర్యటించనున్నారు. ప్రపంచం అబ్బురపడేలా నిర్మిస్తున్న ఆలయ పున:​నిర్మాణ అందాలను వీక్షించనున్నారు. మొదటగా యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత గుట్టపైన ఉన్న క్షేత్రం కలియతిరగనున్నారు. ఆయన వెంట సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై రానున్నారు. అందుకు సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.



Next Story