‘దిశకు జరిగిన న్యాయం చైత్ర కు జరగాలి’

by  |
‘దిశకు జరిగిన న్యాయం చైత్ర కు జరగాలి’
X

దిశ, మొయినాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీలో తోటి పిల్లలతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం చేసిన నిందితుని కటినంగా శిక్షించాలని మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామ సర్పంచ్ స్వరూప యండ్రు, అంబేత్కర్ యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. చైత్ర తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని ఒక తండాకు చెందిన గిరిజన కుటుంబానికి చెందిన వారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చి సింగరేణి కాలనీలో నివాసముంటున్నారు. ఈ సమయంలోనే మానవత్వం లేని మానవ మృగం ఆచిన్నారి జీవితాన్ని చిదిమేసిన నిందితుడిని వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో బాలరాజు నిరంజన్ సుమన్ రవి ప్రశాంత్ రమేష్ గణేష్ పవన్ ప్రశాంత్ సునీల్ మరియు గ్రామ సభ్యులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed