- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటిని అందించే జూరాల ప్రాజెక్టు మీద నుండి రాకపోకలను నిషేధిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏపీతో రోజురోజుకు ముదురుతున్న జల వివాదాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు జోగులాంబ గద్వాల జిల్లాలోని మండలాల ప్రజలు- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆత్మకూర్, అమరచింత, మక్తల్, దేవరకద్ర, మరికల్ ప్రాంతాలనుండి పెద్ద ఎత్తున రాకపోకలు సాగేవి.
ఈ ప్రాంతాల గుండా రాయలసీమకు వెళ్లే వాహనాలు సైతం కొన్ని రాకపోకలు సాగించేవి. ఈ క్రమంలో ప్రాజెక్టులకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే జూరాల ప్రాజెక్టుపై నుండి రాకపోకలు సాధించకుండా గేట్లు మూసివేశారు. దీంతో ప్రజలు, వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు.
Next Story