కథ మీది కల మీది.. రండి గెలుద్దాం : తారక్

by  |
ntr political entry
X

దిశ, సినిమా : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ద్వారా బుల్లితెరపై మరో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం జెమినీ టీవీలో ప్రసారం కాబోతుండగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ప్రోమోను ఈ రోజు(ఆదివారం) విడుదల చేశారు. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో మా టీవీలో ప్రసారమైన నాలుగు సీజన్లకు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున హోస్టులుగా వ్యవహరించగా.. ప్రస్తుతం జెమిని టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో టెలికాస్ట్ కానున్న సీజన్‌ 5కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

‘జీవితాన్ని మారుద్దాం రా అమ్మ.. ఇక్కడ కథ మీది కల మీది, ఆట నాది కోటి మీది, రండి గెలుద్దాం’ అన్న తారక్ మాటలు విని ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’‌లో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్ట్రేషన్లు త్వరలోనే ప్రారంభం కానుండగా, అందుకు సిద్ధంగా ఉండాలని తారక్ సూచించారు. ఇక కొమురం భీమ్‌గా తారక్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబరు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమా చేయబోతున్నాడు తారక్.



Next Story

Most Viewed