నిర్దేశించినా.. నిర్లక్ష్యం చేస్తున్నాడని వైద్యాధికారిని సస్పెండ్ చేసిన కలెక్టర్

by  |
నిర్దేశించినా.. నిర్లక్ష్యం చేస్తున్నాడని వైద్యాధికారిని సస్పెండ్ చేసిన కలెక్టర్
X

దిశ, జడ్చర్ల: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రతాప్ చౌహాన్ ను సస్పెండ్ చేస్తూ గురువారం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పదిహేను రోజులో 100% వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని నిర్దేశించినప్పటికీ రాజాపూర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రతాప్ చౌహన్ వ్యాక్సినేషన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


Next Story

Most Viewed