మరోసారి తెరపైకి సునీత.. ఆ టాలీవుడ్ నిర్మాతకు చిక్కులు తప్పవా..?

by  |
tollywood news
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర నిర్మాత బన్నీవాసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సునీత బోయను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని బన్నీవాసు మోసం చేశాడంటూ గత కొంతకాలంగా ఆమె ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్‌ కార్యాలయం వద్ద సునీత ధర్నా చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఆమెపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా రెండు కేసుల్లో జైలుకు వెళ్లింది. ఇక బయటికి వచ్చాకా కూడా సునీత అదే విధంగా ప్రవర్తిస్తుంటే ఆమెను ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయానికి పంపించి చికిత్స నిర్వహించారు.

ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక షరా మామూలుగా నిర్మాత బన్నీవాసును లక్ష్యంగా చేసుకొని గత జూన్‌ రెండో వారంలో బన్నీవాసు కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో తీసి పోస్ట్‌ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో ఆ కార్యాలయ మేనేజర్‌ అయ్యప్ప పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిర్మాత కార్యాలయానికి వెళ్తున్న సునీతను అడ్డుకొని అరెస్ట్ చేశారు. మంగళవారం ఆమెను కోర్టు లో ప్రవేశపెట్టగా.. మానసిక స్థితి బాగాలేనందున ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో మరోసారి పోలీసులు ఆమెను ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయానికి తరలించారు.

Next Story