షాద్‌నగర్‌లో అమర వీరుడికి నివాళులర్పించిన జర్నలిస్టులు, పోలీసులు

by  |
షాద్‌నగర్‌లో అమర వీరుడికి నివాళులర్పించిన జర్నలిస్టులు, పోలీసులు
X

దిశ, షాద్‌నగర్: భారత్‌-చైనా సరిహద్దులో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన సంతోష్ బాబుకు టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్యర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ముఖ్యకూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేసి 2 నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ CI శ్రీధర్ కుమార్, ఎస్సై విజయ్ భాస్కర్, ట్రాఫిక్ ఎస్సై రఘుకుమార్, పోలీస్ సిబ్బంది, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెక్కల శ్రీశైలం, జర్నలిస్టులు రఘు, భాస్కర్, మొయిజ్, అప్సర్, ఇలియాజ్, సలీం, ధరంపాల్, చందు, మల్లికార్జున్, పూర్ణ, విష్ణు, అరుణ్, యాదగిరి, సాబేర్,సామీ, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story