Breaking News: జర్నలిస్టులపై కరోనా పంజా.. మరో రిపోర్టర్ బలి

by B.Srinivas |   (  Updated:2021-05-24 22:00:05  IST  )

<p>దిశ‌, ఖ‌మ్మం: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా జర్నలిస్టులపై వైరస్ పంజా విసురుతోంది. రోజుకో జర్నలిస్టును పొట్టనబెట్టుకుంటూ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా.. కరోనా మహమ్మారికి మరో జర్నలిస్టు బలయ్యాడు. ఖమ్మం నగరానికి చెందిన కాసం వెంకన్న కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆంధ్రజ్యోతిలో ఎడ్యుకేషన్, కల్చరల్ రిపోర్టర్‌గా పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గతవారం క్రితం ఆనారోగ్యంతో బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా, కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. నాటి [&hellip;]</p>

Journalist venkanna
X

దిశ‌, ఖ‌మ్మం: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా జర్నలిస్టులపై వైరస్ పంజా విసురుతోంది. రోజుకో జర్నలిస్టును పొట్టనబెట్టుకుంటూ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా.. కరోనా మహమ్మారికి మరో జర్నలిస్టు బలయ్యాడు. ఖమ్మం నగరానికి చెందిన కాసం వెంకన్న కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆంధ్రజ్యోతిలో ఎడ్యుకేషన్, కల్చరల్ రిపోర్టర్‌గా పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గతవారం క్రితం ఆనారోగ్యంతో బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా, కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. నాటి నుంచి డాక్టర్ల సూచనల మేరకు ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వెంకన్న మరణవార్త తెలిసిన జర్నలిస్టు మిత్రులు తీవవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Next Story