విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

by  |
JNTUH Registrar
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులు నైపుణ్యతను పెంపొందించుకొని బహుముఖ ప్రజ్ఞాశాలిగా మారి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూరు హుస్సేన్ అన్నారు. మంగళవారం ఎంటెక్, ఎంఫార్మసీ విద్యార్థుల కోసం జేఎన్టీయూహెచ్ లో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆత్మనిర్భర్ భారత్ , మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ స్వయంప్రతిపత్తి విద్యా సంస్థల్లో ఒకటి అన్నారు. ఈ సంస్థ 1989లో ఒక మంచి బోధన తో పాటు పరిశోధనా సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు గోవర్ధన్, సీహెచ్. శశికళ, కోఆర్డినేటర్ సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story