జగన్ ట్వీట్‌కు జేఎంఎం కౌంటర్.. చంద్రబాబుపై కోపంతోనే..

by  |
జగన్ ట్వీట్‌కు జేఎంఎం కౌంటర్.. చంద్రబాబుపై కోపంతోనే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలుస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కరోనా కాలంలో రాష్ట్రాల సీఎంల సూచనలను మోదీ వినడం లేదంటూ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌కు జగన్ స్పందిస్తూ.. కరోనాపై యుద్ధంలో వేలెత్తి చూపే సమయం కాదని, ప్రధానికి అండగా నిలవాల్సిన అవసరముందని కౌంటరిచ్చారు. దీనిపై హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని జేఎంఎం పార్టీ స్పందించింది. చంద్రబాబుపై ఉన్న కోపంతోనే సీఎం జగన్ కేంద్రంతో స్నేహం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. జగన్ కంటే ఝార్ఖండ్ సీఎంకు ఎంతో పరిణిది ఉందని వ్యాఖ్యానించింది.


Next Story

Most Viewed