బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సీనియర్ మహిళా నేత..

by  |
బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సీనియర్ మహిళా నేత..
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులు జిన్నారెడ్డి పద్మజ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు బీజేపీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నటు ప్రకటించారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర బండి సంజయ్‌కి, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తికి లేఖను పంపించారు.

అయితే.. జిన్నారెడ్డి పద్మజ భర్త సీనియర్ నాయకులు జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పదవుల్లో కొనసాగారు. మహబూబాబాద్, పరిసర గ్రామాల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉండేది. అయితే.. రేపు వరంగల్‌కు రానున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువ కప్పుకొనున్నారని జిన్నారెడ్డి పద్మజ ‘దిశ’కు తెలిపారు.

Next Story