- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
వాషింగ్టన్ : గాజా పునర్నిర్మాణానికి కావాల్సిన సహాయాన్ని అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనాలను రెండు రాజ్యాలుగా ఏర్పాటు చేయడమే ఈ సమస్యకు ఉన్న ఏకైక పరిష్కార మార్గమని ఆయన తెలిపారు. జెరూసలెంలో ఇరువర్గాల మధ్య జరుగుతున్న అంతర్గత ఘర్షణలకు తక్షణమే ముగింపు పలికేందుకు చర్యలు చేపట్టాలని ఇజ్రాయెల్ను కోరినట్టు వెల్లడించారు. ఇజ్రాయెల్ రక్షణకు అగ్రరాజ్యం కట్టుబడి ఉందని తెలిపారు.
తమ నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించారు. ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించేంత వరకు నిస్సందేహంగా అక్కడ శాంతి నెలకొనదని తెలిపారు. రెండు దేశాల మధ్య దశాబ్దాల వివాదానికి తెరదించేందుకు జెరూసలెం ఉమ్మడి రాజధానిగా ఇజ్రాయెల్, పాలస్తీనాలను రెండు దేశాల గుర్తించడమే తక్షణ పరిష్కారంగా కనిపిస్తోందన్నారు.
Next Story