- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు 1100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగుల కోసం రూ.125 కోట్ల వ్యయంతో నిర్మించిన గృహ సముదాయాలను జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో కలిసి మంగళవారం ఉదయం ప్రారంభించారు. జెన్ కో సంస్థలో పనిచేసే ఉద్యోగుల సౌకర్యార్థం నిర్మించిన క్వార్టర్స్ను ఆయన ప్రారంభించారు. సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించడమే సంస్థ ధ్యేయమని తెలిపారు. అనంతరం 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో రెండవ కన్వేయర్ బెల్ట్ను ప్రారంభించారు.
చాలా సంవత్సరాల తర్వాత జెన్కో ఎండీ ప్రభాకరరావు జెన్ కోను పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఆ తర్వాత జెన్కో సిబ్బందితో సమావేశమై ఇక్కడ జరుగుతున్న పరిస్థితులపై పూర్తి సమాచారం తెలుసుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. చాలా సంవత్సరాల తర్వాత భూపాలపల్లి జిల్లాలోని జెన్కోకు వచ్చిన సీఎండీ ప్రభాకర్ రావు పర్యటన వివరాలను సంస్థ అధికారులు గోప్యంగా ఉంచారు.