‘టీఆర్ఎస్‌ది పైశాచికానందం’

by  |
‘టీఆర్ఎస్‌ది పైశాచికానందం’
X

టీఆర్ఎస్‌ది పైశాచిక ఆనందమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సహకార ఎన్నికల్లో గెలవడమే కాకుండా, రైతులకు అందాల్సిన సేవల గురించీ ఆలోచించాలని హితవు పలికారు. పంట రుణాలపై రాయితీలు నిలిపివేయడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో హమాలీ చార్జీలు భరించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో, ఆ భారాన్ని రైతులే మోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైతుల బాధలను చూస్తూ, టీఆర్ఎస్ పైశాచికానందం పొందుతున్నదని మండిపడ్డారు.

Next Story

Most Viewed