ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

by  |
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ,వెబ్‌డెస్క్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేంఝర్ జిల్లా పండా పొడా పీఎస్ పరిధిలో సోమగిరి వద్ద చెట్టును జీపు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతులను మయూర్ భంజ్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story