JEE అడ్వాన్స్‌‌డ్.. విద్యార్థులకు మరో ఛాన్స్

by  |
JEE అడ్వాన్స్‌‌డ్.. విద్యార్థులకు మరో ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ :

కరోనా కారణంగా ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్ రాయలేకపోయిన విద్యార్థులకు జాయింట్ అడ్మిషన్ బోర్డు (JAB) మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసి రాయలేకపోయిన విద్యార్థులందరూ వచ్చే ఏడాది ఈ పరీక్ష రాయడానికి అనుమతినిస్తూ మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

ఐఐటీలకు ప్రవేశం కల్పించే ఈ పరీక్షలు రాయడానికి విద్యార్థులకు సాధారణంగా రెండుసార్లే అవకాశముంటుంది. ఇప్పటికే ఒకసారి రాసి, మరోసారి దరఖాస్తు చేసి కరోనా కారణంగా రాయలేకపోయిన వారికీ ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే, వచ్చే ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేవారు మళ్లీ జేఈఈ మెయిన్స్ అర్హత సాధించాలన్న షరతును అమలు చేయడం లేదని పేర్కొంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసినవారితో సమాన అవకాశాన్ని కల్పించినట్టవుతుందని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేఏబీ వెల్లడించింది.



Next Story

Most Viewed