- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ :
కరోనా కారణంగా ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్ రాయలేకపోయిన విద్యార్థులకు జాయింట్ అడ్మిషన్ బోర్డు (JAB) మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసి రాయలేకపోయిన విద్యార్థులందరూ వచ్చే ఏడాది ఈ పరీక్ష రాయడానికి అనుమతినిస్తూ మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
ఐఐటీలకు ప్రవేశం కల్పించే ఈ పరీక్షలు రాయడానికి విద్యార్థులకు సాధారణంగా రెండుసార్లే అవకాశముంటుంది. ఇప్పటికే ఒకసారి రాసి, మరోసారి దరఖాస్తు చేసి కరోనా కారణంగా రాయలేకపోయిన వారికీ ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే, వచ్చే ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ రాసేవారు మళ్లీ జేఈఈ మెయిన్స్ అర్హత సాధించాలన్న షరతును అమలు చేయడం లేదని పేర్కొంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ రాసినవారితో సమాన అవకాశాన్ని కల్పించినట్టవుతుందని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేఏబీ వెల్లడించింది.