జేసీ ప్రభాకర్ రెడ్డి వింత నిరసన.. ఆఫీసులో నిద్ర, స్నానం..!

by  |
జేసీ ప్రభాకర్ రెడ్డి వింత నిరసన.. ఆఫీసులో నిద్ర, స్నానం..!
X

దిశ, ఏపీబ్యూరో : రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో వ్యవహరించే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోమవారం తాను ఏర్పాటు చేసిన సమావేశానికి అధికారులు, సిబ్బంది గైర్హాజరు కావడంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్, అధికారులు వచ్చే వరకూ ఆఫీసులోనే ఉంటానని భీష్మించుకుని కూర్చున్నారు. అంతేకాదు అధికారులు వచ్చేవరకు ఆఫీసు నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు.

దీంతో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు మున్సిపల్ ఆఫీస్ వద్ద జేసీ ఉన్నారు. రాత్రి మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం వద్ద తన అనుచరులతో కలిసి నిద్రపోయారు. మంగళవారం ఉదయం మున్సిపల్ ఆఫీస్ దగ్గరే ఆయన స్నానం చేశారు. అనంతరం వచ్చిన సిబ్బందికి వంగి వంగి దండాలు పెడుతూ నిరసన తెలిపారు.


Next Story