- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ రాజకీయంగా సంచలనం రేపుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడుతూ ఉంటారు. రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఏదైనా ఓపెన్గా చెబితే రాజకీయంగా సమస్య లేదా వివాదం అవుతుందేమోనని భయపడుతూ ఉంటారు. కానీ జేసీ మాత్రం చెప్పాలనుకునే విషయాన్ని సూటిగా చెబుతూ ఉంటారు.
అందుకే జేసీ దివాకర్ రెడ్డి ఏది చెప్పినా అవి సంచలనంగా మారుతూ ఉంటాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన జేసీ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఈ సందర్భంగా షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిన్నరలో షర్మిల ఏపీ రాజకీయాల్లోకి కూడా అడుగుపెడుతుందంటూ జోస్యం చెప్పారు. షర్మిలకు వైసీపీలో ఏదైనా కీలక పదవి ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు.
షర్మిల ప్రస్తుతం వార్మప్ చేస్తోందని, ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఇది కేవలం సన్నాహకమేనని వ్యాఖ్యానించారు. ఏపీ రాజకీయాల్లోకి కూడా షర్మిల అడుగుపెడుతుందంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.